నవంబర్ 24 నుంచి తెలంగాణలో ప్రియాంక ప్రచారం

నవంబర్ 24 నుంచి తెలంగాణలో ప్రియాంక ప్రచారం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడు రోజుల పాటు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 24న ఉదయం పాలకుర్తిలో, మధ్యాహ్నం హుస్నాబాద్, సాయంత్రం ధర్మపురి నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారని పార్టీ ప్రకటించింది.

25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిర నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు.  27న ఉదయం మునుగోడు, మధ్యాహ్నం దేవరకొండ, సాయంత్రం గద్వాల నియోజకవర్గాల్లో జరిగే సభల్లో ప్రియాంక పాల్గొననున్నారు.