పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్ డైట్క్యాంటీన్ టెండర్కు సంబంధించిన సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. ప్రభుత్వం పెంచిన డైట్చార్జీల వ్యవహారం వరుస కోర్టు కేసులతో ఏడాదిన్నర కాలంగా పెండింగ్లో ఉండగా.. రెండోసారి నిర్వహించిన టెండర్ ప్రక్రియ కోర్టు, ప్రభుత్వ జోక్యంతో ముగిసింది. దీంతో ఇయ్యాల్టి నుంచి గాంధీ పేషెంట్లకు, డ్యూటీ డాక్టర్లకు కొత్త మెనూకు సంబంధించి ఫుడ్ సప్లయ్ కానుంది. ఇప్పటివరకు పేషెంట్లకు రూ.40, డాక్టర్లకు రూ.80కి ఫుడ్ ఇస్తుండగా.. మరింత నాణ్యమైన ఫుడ్ను అందించాలనే ఉద్దేశ్యంతో గతేడాది ఏప్రిల్లో డైట్చార్జీలను ప్రభుత్వం డబుల్ చేసింది. పేషెంట్లకు రూ.80, డాక్టర్లకు రూ.160ల భోజనం అందించాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాపత్రుల్లో కొత్తగా డైట్టెండర్లు నిర్వహించాలని స్పష్టం చేసింది. అయితే, గాంధీలోని అప్పటి కాంట్రాక్టర్ కొత్త టెండర్ల నిర్వహణపై కోర్టుకు వెళ్లడంతో.. గాంధీలో ప్రభుత్వ ఉత్తర్వులు అమలు కాలేదు. ఇటీవల అధికారులు తిరిగి రెండోసారి టెండర్నిర్వహించగా, డైట్క్యాంటీన్ నిర్వాహకులు మళ్లీ కోర్టుకు వెళ్లారు. గాంధీ హాస్పిటల్ను దృష్టిలో ఉంచుకొని డైట్ చార్జీలు పెంచితే.. చివరికి అక్కడే అమలు కావడం లేదని గ్రహించిన ప్రభుత్వం అన్ని లీగల్ లిటిగేషన్లను పరిష్కరించింది. కోర్టు ఆదేశాలతో స్టేట్ఫ్యామిలీ వెల్ఫేర్కమిషనర్, జిల్లా డైట్ కమిటీ చైర్మన్ శ్వేతామహంతి ఆధ్వర్యంలో టెండర్ బాక్సులు తెరిచారు. టెండర్వేసిన ఆరుగురు కాంట్రాక్టర్లలో శ్రీవెంకటేశ్వర్అసోసియేషన్ కాంట్రాక్టర్రవికుమార్కు టెండర్ దక్కింది. గాంధీ సూపరింటెండెంట్ రాజారావు గురువారం రవికుమార్కు కొత్త ఆర్డర్ కాపీని అందచేశారు.