కామారెడ్డి జిల్లాలో హోం ఓటింగ్​ షురూ

కామారెడ్డి జిల్లాలో హోం ఓటింగ్​ షురూ

కామారెడ్డిటౌన్​ ​, వెలుగు: కామారెడ్డి జిల్లాలో శనివారం హోం ఓటింగ్​ ప్రక్రియ షురూ అయింది. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎలక్షన్​ కమిషన్​ హోం ఓటింగ్​ నిర్వహిస్తోంది.  కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్​ నియోజక వర్గంలోని టౌన్​తో పాటు, గ్రామాల్లో హోం ఓటింగ్​ నిర్వహించారు.  ఎలక్షన్​ ఆఫీసర్లు, సిబ్బంది వృద్ధులు, దివ్యాంగుల ఇంటికి వెళ్లి ఓటు వేయించారు.  కేంద్రాలకు రాలేని వారి కోసం ఎలక్షన్​ కమిషన్​ హోం  ఓటింగ్​ వేసే అవకాశం కల్పించిందని కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​ పేర్కొన్నారు.  ఓటు వేసేందుకు గోప్యత కోసం కంపార్ట్​మెంట్​ ఏర్పాటు చేశామన్నారు.  ఆదివారం కూడా  హోం ఓటింగ్​ ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్​ పేర్కొన్నారు. జిల్లాలో  ఎలక్షన్​ డ్యూటీలో పాల్గొనే  4,546 మందికి పోస్టల్​ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.  ఆర్డీవో రంగానాథరావు,  ఆఫీసర్లు ఉన్నారు.

కామారెడ్డిటౌన్​ ​, వెలుగు: కామారెడ్డి జిల్లాలో శనివారం హోం ఓటింగ్​ ప్రక్రియ షురూ అయింది. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎలక్షన్​ కమిషన్​ హోం ఓటింగ్​ నిర్వహిస్తోంది.  కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్​ నియోజక వర్గంలోని టౌన్​తో పాటు, గ్రామాల్లో హోం ఓటింగ్​ నిర్వహించారు.  ఎలక్షన్​ ఆఫీసర్లు, సిబ్బంది వృద్ధులు, దివ్యాంగుల ఇంటికి వెళ్లి ఓటు వేయించారు.  కేంద్రాలకు రాలేని వారి కోసం ఎలక్షన్​ కమిషన్​ హోం  ఓటింగ్​ వేసే అవకాశం కల్పించిందని కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​ పేర్కొన్నారు.  ఓటు వేసేందుకు గోప్యత కోసం కంపార్ట్​మెంట్​ ఏర్పాటు చేశామన్నారు.  ఆదివారం కూడా  హోం ఓటింగ్​ ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్​ పేర్కొన్నారు. జిల్లాలో  ఎలక్షన్​ డ్యూటీలో పాల్గొనే  4,546 మందికి పోస్టల్​ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.  ఆర్డీవో రంగానాథరావు,  ఆఫీసర్లు ఉన్నారు.