
హైదరాబాద్: సినిమా షూటింగ్ల బంద్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు నిర్మాత సి.కల్యాణ్. ఆగస్ట్ 1 నుంచి షూటింగ్లను నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం నిర్వహించారు. సినిమా షూటింగ్ ల నిలుపుదల, టికెట్ ధరలపై చర్చించారు. ఈ సమావేశంలో షూటింగ్ ల బంద్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం.
ఇదే విషయంపై సమావేశం తర్వాత నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ ల బంద్ పై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. సినిమా రంగ సమస్యలపై స్పెషల్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో జూలై 27న కమిటీ భేటీ అవుతుందని చెప్పారు. ఈ కమిటీ బుధవారం సమావేశమై... తమ సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. - ఫిల్మ్ ఛాంబర్ అంతా ఏకతాటిపై ఉందన్న కల్యాణ్.. తమ మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదు అనేది అవాస్తవం అన్నారు.