సమ్మర్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా ఓం భీమ్ బుష్

సమ్మర్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా ఓం భీమ్ బుష్

శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్‌‌‌‌లో శ్రీహర్ష కొనుగంటి రూపొందించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’.  యూవీ క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు  నిర్మించిన చిత్రం  మార్చి 22న విడుదలైంది. ఈ సినిమాకొస్తున్న రెస్పాన్స్‌‌‌‌ను తెలియజేసేందుకు టీమ్ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించింది. అతిథిగా హాజరైన నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. అనే ట్యాగ్‌‌‌‌లైన్ పెట్టాలంటే ధైర్యం ఉండాలి.  

నాన్‌‌‌‌స్టాప్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం ఈవాళ థియేటర్స్‌‌‌‌లో లాజిక్ లేదు ఓన్లీ మ్యాజిక్ అని నిరూపించి సమ్మర్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా రన్ అవుతుంది. థియేటర్‌‌‌‌‌‌‌‌కి వెళితే నవ్వుకుని వస్తున్నామని ప్రేక్షకులే చెబుతున్నారు’ అని అన్నారు.  ఈ సమ్మర్ ని థియేటర్స్‌‌‌‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌‌‌‌తో సెలబ్రేట్ చేసే సినిమా ఇదని దర్శకుడు మారుతి అన్నాడు. శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘ఈ సినిమా చాలా రోజులు ఆడుతుందని మా అందరి గట్టి నమ్మకం.  ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’  చెప్పాడు. 

‘తెరపై మమ్మల్ని మేము చుసుకున్నపుడు మిగతా వారు ఆనందంగా నవ్వడం చూసి మేము ఆనందం పడుతున్నాం’ అని రాహుల్ రామకృష్ణ అన్నాడు.  ‘థియేటర్స్‌‌‌‌లో ప్రేక్షకులు సినిమా చూసి పగలబడి నవ్వుతున్నారు. వారి నవ్వులు చూసిన తర్వాత మేము రెండేళ్ళు పడిన కష్టం మర్చిపోయాం’ అని దర్శకుడు శ్రీహర్ష చెప్పాడు. దర్శకులు రామ్  అబ్బరాజు, హసిత్ గోలి, పవన్ సాధినేని, హుస్సేన్,  నిర్మాత ఎస్‌‌‌‌కేఎన్ సినిమా సక్సెస్‌‌‌‌ అయినందుకు ఆనందంగా ఉందన్నారు.