Dil Raju: భైరవకోన వాయిదా..ఈగల్ రిలీజ్ అప్పుడే..వాళ్లు అడిగినా వినలేదు

Dil Raju: భైరవకోన వాయిదా..ఈగల్ రిలీజ్ అప్పుడే..వాళ్లు అడిగినా వినలేదు

ఈ ఏడాది సంక్రాంతికి వరుసగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. సంక్రాంతి బరిలో ఉండాల్సిన రవితేజ ఈగల్ మూవీ మాత్రం ఫిలిం ఛాంబర్ విజ్ఞప్తి మేరకు పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్స్ సినిమాని వాయిదా వేశారు. అయితే, ఫిలిం ఛాంబర్ సమావేశంలో..ఈగల్ ప్రొడ్యూసర్స్ కు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని..ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఛాంబర్ అధ్యకుడు దిల్ రాజ్ సైతం మాట ఇచ్చారు. ప్రస్తుతం రవితేజ ఈగల్ మూవీ సోలో రిలీజ్ డేట్ సమస్యపై..థియేటర్ల కేటాయింపులకై దిల్ రాజు ఇవాళ (జనవరి 29న)ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఇదే విషయంపై తాజాగా దిల్ రాజు మాట్లాడుతూ..'ఫిబ్రవరి 9న విడుదల కావాల్సిన భైరవకోన సినిమా నిర్మాతలతో మాట్లాడాం..వాయిదా వేయడానికి ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాతలు ఒప్పుకున్నారు. దీంతో ఫిబ్రవరి 9న ఈగల్ మెజార్టీ థియేటర్లలో రిలీజ్ అవుతుందని తెలిపారు. 

అయితే, ఫిబ్రవరి 8న యాత్ర-2, రజినీకాంత్ లాల్ సలాం సినిమాల విడుదలపై ప్రొడ్యూసర్స్ తో చర్చించగా అందుకు వాయిదా వేయడం కుదరదని తేల్చి చెప్పారు. ఎందుకంటే లాల్ సలాం మూవీ తమిళంలో రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది ..కనుకే తెలుగులో అదే డేట్ కి రిలీజ్ కావాల్సిన అవసరం ఉందని వారు సున్నితంగా చెప్పారని దిల్ రాజు అన్నారు. 

కాగా..భైరవకోన సినిమా మేకర్స్ మాత్రం..ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాన్ని గౌరవిస్తూ..ఒక వారం రోజులు సినిమా పోస్ట్ ఫోన్ చేసుకోవడానికి అంగీకరించారు. అంటే ఈ సినిమా ఫిబ్రవరి 15 న రాబోతున్నట్లు ఛాంబర్ ప్రెస్ మీట్ లో ప్రకటించారు. అలాగే తాను వచ్చే టర్మ్ కి మాత్రం ప్రెసిడెంట్ గా ఉండే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఇక ఇవాళ మెగాస్టార్ చిరంజీవిని కలవబోతున్నట్లుగా ఆయన ప్రెస్ మీట్ లో వెల్లడించారు.

ఇక ఈగల్ సినిమా విషయానికి వస్తే..  కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని  టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించారు.  ఇందులో రవితేజ సరసన అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్, కావ్య థాప‌ర్ హీరోయిన్లుగా న‌టించగా. న‌వ‌దీప్ కీల‌క పాత్ర పోషించాడు. ముందుగా ఈ సినిమాను జనవరి 13న రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్.