అందుకే గుంటూరు కారం రిలీజ్ చేయడం లేదు.. కారణం చెప్పిన నిర్మాత

అందుకే గుంటూరు కారం రిలీజ్ చేయడం లేదు.. కారణం చెప్పిన నిర్మాత

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గుంటూరు కారం(Guntur kaaram). హారికహాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు(Chinababu) నిర్మిస్తున్న ఈ సినిమాలో.. లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల(Sreeleela), ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi chaudary) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈమధ్య కాలంలో గుంటూరు కారం సినిమాపై వచ్చినన్నీ రూమర్స్ మరే సినిమాపై వచ్చి ఉండవు. హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, రిలీజ్ డేట్.. ఇలా ప్రతి విషయంలో ట్రెండ్ అయ్యింది ఈ సినిమా. తాజాగా ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చాడు నిర్మాత నాగవంశీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన గుంటూరు కారం సినిమా గురించి మాటాడుతూ.. గుంటూరు కారం సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అంతేకాదు నాన్ రాజమౌళి సినిమా కలెక్షన్స్ రికార్డుల్లో.. గుంటూరు కారం ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ గుంటూరు కారం ఇతర భాషల్లో రేలసే అవుతుందా అన్న ప్రశ్నకు బదులుగా..  టైం అండ్ క్వాలిటీ గురించి ఆలోచించి ఈ సినిమాని కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తున్నాము. ఇతర భాషల్లో డబ్ చేయడం లేదని  క్లారిటీ ఇచ్చారు.