
ధన్య బాలకృష్ణ, సూర్య అయ్యలసోమయాజుల జంటగా మిహిరామ్ వైనతేయ దర్శకత్వంలో దీపికాంజలి వడ్లమాని నిర్మించిన చిత్రం ‘రామ్’. శుక్రవారం సినిమా విడుదలవుతున్న క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, బెక్కెం వేణుగోపాల్ హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. హీరో సూర్య మాట్లాడుతూ ‘రామ్’ అంటే భక్తి సినిమా కాదు.. దేశ భక్తి సినిమా. ప్రతీ డైలాగ్ తూటాలా ఉంటుంది.
క్లైమాక్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది’ అని చెప్పాడు. సాయి కుమార్ మాట్లాడుతూ ‘కంటెంట్ నచ్చితే సినిమాను ఆపలేరు. ‘హనుమాన్’ తరహాలో ‘రామ్’ కూడా ఆకట్టుకుంటుంది’ అన్నారు. ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ ‘సాయి కుమార్ గారితో నటించడం హ్యాపీ. సూర్య, దీపికలు ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టారు.
దర్శకుడు చాలా పెద్ద స్థాయికి వెళ్తారు’ అని చెప్పింది. ‘దేశ సరిహద్దు లోపల టెర్రరిస్టు దాడుల నుంచి మనల్ని కాపాడే అన్ సంగ్ హీరోల గురించి ఇందులో చూపించాను’ అని దర్శకుడు చెప్పాడు. ‘ఈ సినిమాకు తెగే ప్రతీ టికెట్లో రూ.5/- లు నేషనల్ డిఫెన్స్ ఫండ్కు ఇస్తాం. మన దేశ సైనికులకు ఈ సినిమాను అంకితం చేస్తున్నాం’ అని నిర్మాత దీపికాంజలి అన్నారు.