చర్లపల్లి మహిళ మర్డర్ కేసులో పురోగతి.. సంచిలో డెడ్బాడీ తెచ్చింది పశ్చిమబెంగాల్వాసి

చర్లపల్లి మహిళ మర్డర్ కేసులో పురోగతి.. సంచిలో డెడ్బాడీ తెచ్చింది పశ్చిమబెంగాల్వాసి

మల్కాజిగిరి, వెలుగు: మహిళను చంపి కాళ్లు చేతులు కట్టి సంచిలో కుక్కి చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆటో పార్కింగ్ స్థలం వద్ద పడేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు గుర్తించారు. రాచకొండ క్రైం బ్రాంచ్ డీసీపీ అరవింద్ బాబు, ఆర్​పీఎఫ్​సీఐ రాకేశ్, ఏసీపీ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ బెంగాల్ మాల్దా టౌన్‎కు చెందిన వలస కార్మికులే ఈ పనిచేసినట్లు గుర్తించారు. వీరు ఓఆర్ ఆర్ పనుల్లో భాగంగా పని కోసం వచ్చారు. మహిళ డెడ్​బాడీని దాదాపు 38 కిలోమీటర్లు ఆటోలో పెట్టుకొని వచ్చారు. 

సోమవారం ఉదయం 11:40 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్‎కు మురళి అనే వ్యక్తి మహిళ డెడ్​బాడీతో చేరుకున్నాడు. గంటన్నర పాటు రిజర్వేషన్ కౌంటర్ సమీపంలో కూర్చున్నాడు. సంచిలో కుక్కిపెట్టిన డెడ్​బాడీని అక్కడే వదిలి నాలుగో ప్లాట్​ఫాంలో డ్రెస్​ చేంజ్​ చేసుకున్నాడు. తరువాత ఐదో నెంబర్ ప్లాట్ ఫాంలో 3:55 కు అగర్తలా ట్రైన్  ఎక్కి మాల్దా టౌన్‎లో దిగినట్టు సమాచారం. చనిపోయిన మహిళ వయసు సుమారు 47 సంవత్సరాలు, నిందితుడి వయస్సు 50 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.