ఉప్పల్, వెలుగు: కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక విజ్ఞప్తి చేసింది. ఉప్పల్చిల్కానగర్లో ఆదివారం మలిదశ ఉద్యమకారుడు నేర్ధం భాస్కర్గౌడ్ఆధ్వర్యంలో గజ్జల సత్యరాజ్గౌడ్అధ్యక్షతన అఖిలపక్ష పార్టీల తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్, ఐడీ కార్డు, హెల్త్కార్డు వంటి హామీలను ఇచ్చిందన్నారు. వాటిని ఇప్పటికీ నెరవేర్చకపోవడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్అధికారంలోకి రావడంలో ఉద్యమకారుల పాత్ర ఎంతో ఉందని తెలిపారు. కార్యక్రమంలో గోపు సదానంద్, అంబటి జగదీశ్, చీమ శ్రీనివాస్, తెలంగాణ సంపత్ తదితరులు పాల్గొన్నారు.
