హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న సీనియర్ లెక్చరర్లకు ప్రమోషన్లు లభించాయి. 27 మంది సీనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపల్స్గా ప్రమోషన్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, వారిని కొత్తగా ఏర్పాటు చేసిన డిగ్రీ కాలేజీలకు అలాట్ చేసింది. లెక్చరర్గా 15 ఏండ్ల సీనియార్టీతో పాటు పీహెచ్డీ పూర్తి చేసుకున్న వారికి ప్రిన్సిపల్స్గా ప్రమోషన్లు ఇచ్చేందుకు డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) ఆమోదం తెలిపింది.
కాగా, చాలాకాలం తర్వాత ప్రిన్సిపల్స్ ప్రమోషన్లు జరిగాయని, దీంతో సర్కారు డిగ్రీ కాలేజీలు మరింత బలోపేతం అవుతాయని తెలంగాణ గవర్నమెంట్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంగి రమేశ్, బ్రిజేష్ తెలిపారు. లెక్చరర్లకు ప్రమోషన్లు ఇచ్చిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణకు వారు కృతజ్ఞతలు తెలిపారు.