ఆస్తి గొడవలు.. అన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముడు

ఆస్తి గొడవలు.. అన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముడు

ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య దూరాన్ని పెంచాయి. చివరికి వారి మధ్య ఘర్షణ జరిగి అన్నను తమ్ముడు కత్తితో పొడిచిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాజేడు మండల పరిధి ఇప్పగూడెంలో మోడెం చంటి, శివాజీ అన్నదమ్ములు నివసిస్తున్నారు. ఇరు కుటుంబాల మధ్య తరచూ ఆస్తి గొడవలు జరుగుతూ ఉండేవి. పెద్ద మనుషుల సమక్షంలో పలు మార్లు సర్ది చెప్పిన వివాదం సద్దుమణగలేదు. 

ఈ క్రమంలో అన్నపై కక్ష పెంచుకున్న శివాజి హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అదను చూసి కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు వదిలాడు. నిందితుడు శివాజీని వాజేడు పోలసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.