ధర్నా చౌక్ లో మణిపూర్ వాసుల దీక్ష

ధర్నా చౌక్ లో మణిపూర్ వాసుల దీక్ష

ముషీరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మణిపూర్​లో అలర్లను ఆపి, శాంతి నెలకొల్పాలని సిటీలో ఉంటున్న మణిపూర్ వాసులు కోరారు. ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మణిపూర్ సొసైటీ సభ్యులు లెనిన్, ప్రకాశ్, మనోజ్, దినేశ్, జన్ వాసన్ మాట్లాడుతూ.. మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లు మతాలకు సంబంధించిన గొడవలు కాదన్నారు.

ఎంతో కాలంగా మైతేయి కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండును పట్టించుకోకుండా ఘర్షణ పేరుతో అల్లర్లు సృష్టిస్తున్నారన్నారని వాపోయారు. మణిపూర్ లోకి రాకుండా చొరపాటులను కట్టడి చేయాలని కోరారు