గుడ్ న్యూస్: పెరిగిన PF వడ్డీరేటు

గుడ్ న్యూస్: పెరిగిన PF వడ్డీరేటు

న్యూఢిల్లి : పీఎఫ్ డిపాజిట్లపై 2018-19 సంవత్సరానికి 8.65 శాతం వడ్డీరేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది EPFO. దీనికి EPFO కేంద్ర ధర్మకర్తల మండలి సభ్యులు ఆమోదం తెలిపినట్లు చెప్పారు కేంద్రమంత్రి సంతోష్ గాంగ్వర్. ఈ ప్రతిపాదనను త్వరలో ఆర్థికమంత్రికి పంపిస్తామన్నారు. ఆర్థికశాఖ అమోదం తర్వాత చందాదారుల ఖాతాల్లో జమ అవుతుందని వివరించారు. ప్రస్తుతం 8.55శాతం వడ్డీని ఇస్తున్నారు.