
పద్మారావునగర్, వెలుగు: ప్రజా సమస్యలపై వచ్చే ఫిర్యాదులకు అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. శుక్రవారం ఆయన బన్సీలాల్ పేట డివిజన్ లో విస్తృతంగా పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రూ.46.20 లక్షలతో వివిధ పనులకు శంకుస్థాపన చేశారు.
భోలక్ పూర్ లోని సుందర్ నగర్, పెంటయ్య బస్తీలో రూ.37 లక్షలతో సీసీ రోడ్డు పనులు, బోయగూడలోని మల్లికార్జున స్వామి ఆలయం సమీపంలో రూ.9.20 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇటీవల మరణించిన సుందరయ్య కాలనీకి చెందిన బీఆర్ఎస్ నాయకుడు సైకిల్ షాప్ నర్సింహా కుటుంబాన్ని పరామర్శించారు. బన్సీలాల్ పేట డివిజన్ లోని జీవైఆర్ కాలనీ గోపాల్ దాస్ భజన మండలి మఠాన్ని
సందర్శించారు. షెడ్డు నిర్మించాలని, ఫ్లోరింగ్ చేపట్టాలని, లైట్ లను ఏర్పాటు చేయాలని మఠం అధ్యక్షుడు శంకర్ బాబు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, డీసీ డాకునాయక్, ఈఈ సుబ్రహ్మణ్యం, వాటర్ వర్క్స్ డీజీఎం ఆశిష్, స్ట్రీట్ లైట్ ఏఈ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.