దివ్యాంగులకు అండగా ప్రజా ప్రభుత్వం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

దివ్యాంగులకు అండగా ప్రజా ప్రభుత్వం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మలక్ పేట, వెలుగు: తెలంగాణ ప్రజా ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. హెలెన్ కెల్లర్ 145వ జయంతి సందర్భంగా శుక్రవారం మలక్ పేట్ నల్గొండ చౌరస్తాలోని జాతీయ దివ్యాంగుల పార్కులో హెలెన్ కెల్లర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం మాట్లాడుతూ.. హెలెన్ కెల్లర్ గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. దివ్యాంగులకు ప్రజాప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉండి  సమస్యలు పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. రూ.50 కోట్లతో ఉపకరణాలను కొనుగోలు చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. అనంతరం బదిర ఆశ్రమ పాఠశాల స్టూడెంట్లతో కలిసి మంత్రి భోజనం చేశారు.