21న ఆర్టీసీపై ప్రజాభిప్రాయ సేకరణ

21న ఆర్టీసీపై ప్రజాభిప్రాయ సేకరణ

public opinion on RTCహైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఆర్టీసీలో పరిస్థితిపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆర్టీసీ స్టాఫ్‌‌‌‌  అండ్‌‌‌‌ వర్కర్స్‌‌‌‌  ఫెడరేషన్‌‌‌‌  ప్రధాన కార్యదర్శి వీఎస్‌‌‌‌  రావు తెలిపారు. ఈ నెల 21న హైదరాబాద్‌‌‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రొఫెసర్‌‌‌‌ నాగేశ్వర్‌‌‌‌రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని.. ఆర్టీసీలోని అన్ని యూనియన్లు, ఇతర పౌర సంఘాలు, ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. ఆర్టీసీపై పబ్లిక్‌‌‌‌  హియరింగ్‌‌‌‌  నిర్వహించాలని ఎండీకి వినతిపత్రం ఇచ్చినా స్పందించడం లేదన్నారు. రాష్ట్రంలో జనం సంఖ్య పెరిగినా ఐదేళ్లలో ఒక్క బస్సు కూడా పెరగలేదని పేర్కొన్నారు.