
బ్యూటీ కృతి ఖర్బందా(Kriti Kharbanda) తెలుగు, కన్నడ, హిందీ భాషా చిత్రాలలో తన నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. మోడల్గా తన కెరీర్ను స్టార్ట్ చేసిన కృతి..తెలుగులో సుమంత్ 'బోణి' మూవీ లో నటించింది. బ్రూస్లీ మూవీలో రామ్ చరణ్కు అక్కగా నటించి మంచి పేరు సంపాదించింది.
ఇకపోతే..హీరోయిన్ కృతి ఖర్బందా రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. గత నాలుగేళ్లుగా నటుడు పులకిత్ సామ్రాట్(Pulkit Samrat) తో డేటింగ్లో ఉన్న ఈ భామ..రీసెంట్గా నిశ్చితార్థం చేసుకుంది. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ప్రకటన కృతి అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ..పులకిత్ తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అలాగే ఈ ఫొటోస్ను జత చేస్తూ గ్లింప్స్ వీడియో షేర్ చేశారు. దీంతో వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు వీళ్ల పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు వాటిని నిజం చేశారు.
ఈ నిశ్చితార్థం వేడుక అతి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యే జరిగింది. ఇక లేటెస్ట్ కృతి-పులకిత్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..నిశ్చితార్థం జరిగిన విషయం బయటపడింది. కృతి పెళ్లి వచ్చే నెలలో ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. త్వరలో వీరి పెళ్లిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.
కృతి ఖర్బందా తెలుగులో సుమంత్ హీరోగా వచ్చిన బోణి మూవీతో ఎంట్రీ ఇచ్చి..తీన్ మార్, అలా మొదలైంది, మిస్టర్ నూకయ్య, ఓం త్రీడీ, ఒంగోలు గిత్త, చివరగా 2015లో రామ్ చరణ్ బ్రూస్లీ సినిమాలో నటించింది.ఇక ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశం రాలేదు. దీంతో హిందీపై పూర్తి ఫోకస్ చేసింది.