- ఐదేండ్లలోపు పిల్లలందరికీ వ్యాక్సిన్ వేయించాలి : ఆర్వీ కర్ణన్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర్నుంచి, ఐదేండ్ల వయసు ఉన్న పిల్లలందరికీ వ్యాక్సిన్ వేయించాలని ఆయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని బస్తీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఒకవేళ ఆదివారం ఎవరైనా వ్యాక్సిన్ వేయించలేకపోతే సోమ, మంగళ వారాల్లో అంగన్ వాడీ సెంటర్లు, సబ్ సెంటర్లు, సమీప హాస్పిటళ్లకు వెళ్లి దానిని వేయించుకోవాలని సూచించారు. 70 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది, డాక్టర్లు పాల్గొననున్నారు.