ఆస్పత్రిలో చేరిన పంజాబ్‌ సీఎం మాన్‌

ఆస్పత్రిలో చేరిన పంజాబ్‌ సీఎం మాన్‌

ఢిల్లీ : పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌(48) ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరారు. అస్వస్థతతో బుధవారం ఉదయమే ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. మాన్ కు ఇన్‌ఫెక్షన్‌ సోకిందని వైద్యులు నిర్ధారించారు.

దగ్గరి బంధువైన డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌(32)ను మాన్‌ ఈమధ్యే రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆస్పత్రిలో ఉండగానే సీఎం భగవంత్‌ మాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. సింగర్‌ సిద్ధూ మూసేవాలా నిందితుల్లో ఇద్దరిని, యాంటీ గ్యాంగ్‌స్టర్‌ టాస్క్‌ఫోర్స్‌ బుధవారం అమృత్‌సర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టినందుకు అభినందనలు తెలియజేశారు.