ఢిల్లీ : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(48) ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరారు. అస్వస్థతతో బుధవారం ఉదయమే ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. మాన్ కు ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు నిర్ధారించారు.
Punjab CM Bhagwant Mann admitted to hospital in Delhi
— ANI Digital (@ani_digital) July 21, 2022
Read @ANI Story | https://t.co/VSMw7uQJJM#BhagwantMann #PunjabCM pic.twitter.com/FEloBfBkmJ
దగ్గరి బంధువైన డాక్టర్ గురుప్రీత్ కౌర్(32)ను మాన్ ఈమధ్యే రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆస్పత్రిలో ఉండగానే సీఎం భగవంత్ మాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. సింగర్ సిద్ధూ మూసేవాలా నిందితుల్లో ఇద్దరిని, యాంటీ గ్యాంగ్స్టర్ టాస్క్ఫోర్స్ బుధవారం అమృత్సర్లో జరిగిన ఎన్కౌంటర్లో మట్టుపెట్టినందుకు అభినందనలు తెలియజేశారు.