
గండిపేట్, వెలుగు: గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం కేసులో మాజీ సర్పంచ్ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. నార్సింగి మున్సిపాలిటీ పుప్పాలగూడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మహేశ్వరం సునీత తన పదవీ కాలంలో రూ.2. 02 కోట్ల నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
రాజేంద్రనగర్ డివిజనల్ పంచాయతీ అధికారి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పంచాయతీ నిధులు దారి మళ్లినట్లు తేలింది. హైదరాబాద్ గ్రామపంచాయతీ ట్రిబ్యూనల్ ఆదేశాల మేరకు మాజీ సర్పంచ్ రూ.23 లక్షల 68 వేల 618 తిరిగి చెల్లించారు. అయినా తెలంగాణ లోకాయుక్త ఆదేశాల మేరకు క్రిమినల్ కేసు నమోదు చేశారు. శుక్రవారం ఆమెను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.