అధికారిపై ప్రభుత్వం ఆగ్రహం మహబూబాబాద్ డిఆర్డిఓ సస్పెండ్

అధికారిపై ప్రభుత్వం ఆగ్రహం మహబూబాబాద్ డిఆర్డిఓ సస్పెండ్

మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ డిఆర్డిఓగా  పనిచేస్తున్న పురుషోత్తం పై సస్పెన్షన్ వేటు పడింది. జయశంకర్ భూపాలపల్లి లో డిఆర్డిఏ, పీడిగా ఆయన పని చేసిన సమయంలో ఆర్ధిక అంశాలకు సంబంధించిన రికార్డులను అందజేయకపోవడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ఉన్నతాధికారుల సూచనలను ఏ మాత్రం పట్టించుకోకుండా వుండడంపై విచారణ చేపట్టిన ఆధికారలు పురుషోత్తాని సస్పెండ్ చేశారు. 

విచారణలో నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలడంతో పురుషోత్తం పురుషోత్తంపై సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మహబూబాబాద్ డిఆర్డిఓ గా పనిచేస్తున్న పురుషోత్తం ను బాధ్యతల నుంచి  తప్పించాలని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ కు ఉత్తర్వుల్లో సూచించారు.