‘పుష్ప’ చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమా తరపున పాల్గొనే అవకాశం అల్లు అర్జున్కు దక్కింది. బెర్లిన్ 74వ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు గురువారం బన్నీ జర్మనీకి బయల్దేరాడు.
‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ వరల్డ్వైడ్గా గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా ‘పుష్ప: ది రైజ్’ సినిమా స్పెషల్ షోతో భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం వహించడానికి అల్లు అర్జున్ సిద్ధమయ్యాడు. ఇప్పటికే వివిధ దేశాల సెలబ్రిటీలు సైతం పుష్ప రాజ్ మేనరిజమ్స్తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప ది రూల్’ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుంది.