
- కేసీఆర్కు దళిత ద్రోహి అవార్డు ఇయ్యాలె
- కేంద్ర మాజీ మంత్రి పుష్పలీల ఫైర్
హైదరాబాద్, వెలుగు : అబద్ధాలపై పేటెంట్ కేసీఆర్ దే అని మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షురాలు పుష్పలీల అన్నారు. దళిత సీఎం అని చెప్పి మోసం చేసిన కేసీఆర్కు దళిత ద్రోహి అవార్డు ఇవ్వాలన్నారు. శుక్రవారం ఆమె గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని, ఎస్సీ సబ్ప్లాన్ను నీరుగార్చారని ఆరోపించారు.
దళితబంధు ద్వారా ఎంత మంది దళితులకు ఆర్థిక సాయం అందించారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే దళితబంధు అందిందన్నారు. బీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్ కేడర్ సైనికులలా పనిచేస్తున్నారన్నారు. దళితుల కోసం ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రకటించిందన్నారు.