
భీమదేవరపల్లి,వెలుగు : దివంగత ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని శనివారం హనుమకొండ జిల్లా వంగరలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పీవీ జ్ఞాపకార్థం వంగరలో నిర్మిస్తున్న విజ్ఞాన కేంద్రం, మ్యూజియం, గ్యాలరీ, ఓపెన్ థియేటర్, యోగ కేంద్రం, మహిళా శక్తి కేంద్రం పనులను జయంతి నాటికి పూర్తి చేయాలని భావించారు.
కానీ వివిధ కారణాలతో పనులు ఆలస్యం అయ్యాయి. అయితే స్మృతి వనం పనులు మధ్యలో ఉండగానే ప్రారంభించవద్దని, పూర్తిగా కంప్లీట్ అయ్యాకే ప్రారంభిద్దామని మంత్రి పొన్నం సూచించినట్లు తెలిసింది. దీంతో వీపీ జయంతిని అధికారికంగా జరుపుతున్నట్లు కుటుంబ సభ్యులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.