తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని బర్తరఫ్ చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు సీఎం స్టాలిన్. హోదా మరిచి రాజకీయ నేత స్థాయిలో గవర్నర్ స్థాయిలో విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుల ఆమోదంలోనూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని సీఎం తన లేఖలో పేర్కొన్నారు.
మంత్రిని బర్తరఫ్ చేస్తూ గవర్నర్ తీసుకోవడం రాజ్యా్ంగాన్ని తీవ్రంగా ఉల్లఘించడమేనని స్టాలిన్ తన లేఖలో తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన వారి మనోభావాలను కాపాడేందుకు గవర్నర్ రవి రాజ్యాంగ పదవిలో కొనసాగడం సముచితమా కాదా అనేది రాష్ట్రపతి దృష్టికి వదిలివేస్తున్నట్లు తెలిపారు.
గవర్నర్ రవి తమిళనాడులో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, దానివల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు స్టాలిన్.