
- సర్కారు బడిలో సీట్ల కోసం క్యూ !
- 6వ తరగతిలో 160 సీట్లకు 400 దరఖాస్తులు
- 7 నుంచి 10 తరగతులవరకు ఖాళీలు లేకపోయినా 200 అప్లికేషన్లు
సిద్దిపేట రూరల్, వెలుగు : ప్రభుత్వ బడుల్లో సదువు సక్కగ చెప్పరని చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తుంటారు. కానీ, సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ స్కూల్ లో మాత్రం అడ్మిషన్ కోసం తల్లిదండ్రులు పోటీ పడుతుంటారు. ఈ స్కూల్ లో అడ్మిషన్స్ తీసుకోవడానికి సోమవారం పేరెంట్స్ క్యూ కట్టారు. 6వ తరగతిలో ఖాళీగా ఉన్న160 సీట్ల కోసం 400 దరఖాస్తులు చేసుకోవడానికి రాగా, స్కూల్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అయితే ప్రభుత్వ పాఠశాలలో చదివిన 138 మందికి మొదట అవకాశం కల్పిస్తామని, తర్వాత ప్రైవేట్ స్కూల్స్స్టూడెంట్స్కు ఛాన్స్ఇస్తామని హెచ్ఎం రామస్వామి తెలిపారు. ఇప్పటికే 7,8,9,10 తరగతుల్లో సీట్లు నిండిపోయినా 200 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారన్నారు. స్కూల్లోని ప్రతి క్లాసులో స్టూడెంట్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం , ఇంట్లో సమస్యలు పిల్లల చదువుపై పడకుండా చూడడం, డిజిటల్ ల్యాబ్, మల్టీపర్పస్ కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్స్ ఈ స్కూల్కు ఆకర్షితులు కావడానికి ప్రధాన కారణాలు. ఇక్కడి స్టూడెంట్స్కు కంప్యూటర్ , రోబోటిక్స్, గూగుల్ కోడింగ్ , యోగాల్లో స్పెషల్ట్రైనింగ్ఇస్తారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని తహతహలాడుతుంటారు. అయితే మరింత మంది టీచర్లు ఉంటే తమ పిల్లలందరికీ ఈ స్కూల్లో అడ్మిషన్ దొరుకుతుందని, మంత్రి హరీశ్రావు స్పందించి ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.