ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో ఇప్పటికే అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను ఏప్రిల్ 2 వరకు ఐదు రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు. మరోవైపు అధికారికంగా పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ని జత చేస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు.
దేశంలో అతి తక్కువ కేసుల్లోనే ఈ యాక్ట్ని ప్రయోగించారు. ఇప్పటి వరకు అధికార దుర్వినియోగం, ప్రభుత్వానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని ధ్వంసం చేసిన కేసుల్లోనే నిందితులు ప్రణీత్, తిరుపతన్న, భుజంగరావును విచారించారు.