హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ శుక్రవారం రిలీజైంది. ఫ్యాన్స్ ఎదురు చూపులకు తగ్గట్లుగానే ఈ పోస్టర్ను మూవీ యూనిట్ ఆకట్టుకునేలా డిజైన్ చేసింది. ముందు నుంచి ప్రచారంలో ఉన్న రాధే శ్యామ్ టైటిల్ ఈ ఫస్ట్ లుక్తో కన్ఫమ్ అయింది. ప్రభాస్, పూజా హెగ్డే డ్యాన్స్ చేస్తున్న లుక్ను రొమాంటిక్ పెయింటింగ్లా తీర్చిదిద్దడంతో ఈ పోస్టర్ నెట్లో వైరల్ అవుతోంది. హీరో, హీరోయిన్స్ డ్రెస్సింగ్ స్టయిల్ కూడా ఎట్రాక్టివ్గా ఉంది. ఈ ఫస్ట్ లుక్ను తన ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేసిన డార్లింగ్.. ‘ఫ్యాన్స్ ఇది మీ కోసమే. మీరు దీన్ని ఇష్టపడతారని అనుకుంటున్నా’ అనే క్యాప్షన్ను జత చేశాడు.
జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ కథ యూరప్లో సాగుతుందని సమాచారం. ఇదో పీరియడ్ లవ్ స్టోరీ అని టాలీవుడ్ టాక్. ఈ మూవీలో పూజా హెగ్డే రాజ కుమారిగా కనిపించనుందని తెలిసింది. రెండేళ్లుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీలక సన్ని వేశాల చిత్రీకరణ కోసం మార్చిలో ప్రభాస్, పూజా హెగ్డే, ప్రియదర్శి, బాలీవుడ్ నటి భాగ్యశ్రీ జార్జియాకు వెళ్లారు. అయితే కరోనా కారణంగా షూటింగ్ను త్వరగా ముగించుకొని మార్చి 18న తిరిగి ఇండియాకు వచ్చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సినీ యూనిట్ మొత్తం రెండు వారాలు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండటం గమనార్హం. యూవీ క్రియేషన్స్ రాధే శ్యామ్ను భారీ బడ్జెట్తో నిర్మిస్తోందని తెలిసింది. తెలుగు, తమిళం, మలమాళంతోపాటు హిందీ భాషల్లో ఈ మూవీని వచ్చే సమ్మర్లో పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తారని సమాచారం.