తెల్లాపూర్​కు బీఆర్​ఎస్​ చేసిందేమీ లేదు : రఘునందన్​ రావు

తెల్లాపూర్​కు బీఆర్​ఎస్​ చేసిందేమీ లేదు : రఘునందన్​ రావు

రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్​అడ్డాగా రియల్​ఎస్టేట్ వ్యాపారం చేస్తూ బీఆర్​ఎస్​ నేతలు డబ్బులు సంపాదించుకున్నారే తప్ప ప్రజల గురించి ఆలోచించలేదని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్ధి ఎం. రఘునందన్ రావు ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్​ పాలనలో ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. మంగళవారం బీహెచ్ ఈఎల్​ జిల్లా పరిషత్​స్కూల్​దగ్గర ఆయన వాకర్స్​తో మాట్లాడారు. 

అనంతరం కీర్తి మహల్​ సెంటర్, విద్యుత్​ నగర్​లో కూడా వాకర్స్ మీటింగ్​లో పాల్గొన్నారు. తెల్లాపూర్​ రైల్వే స్టేషన్​దగ్గర ఆయన మాట్లాడుతూ, తాను తెల్లాపూర్​లోనే ఉంటానని, ఇక్కడే ఓటుహక్కు ఉందని చెప్పుకుంటున్న వ్యక్తి ఇక్కడి ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. తెల్లాపూర్ రైల్వే స్టేషన్​కు వచ్చేందుకు సరైన దారి లేక ఇక్కడి ప్రజలు లింగంపల్లికి వెళ్లి ఎంఎంటీఎస్ ఎక్కుతున్నారని అన్నారు. పదేళ్లలో రైల్వే ఫుట్ఓవర్​ బ్రిడ్జి నిర్మించకపోవడం సిగ్గుచేటన్నారు. తాను గెలిచిన వెంటనే ఫుట్ ఓవర్​ బ్రిడ్జ్ మంజూరు చేయిస్తానన్నారు. తెల్లాపూర్​ 7వ రేడియల్​ రోడ్డును రింగ్ రోడ్డుకు లింక్​ చేస్తే అందరికీ ఉపయోగపడుతుందన్నారు.