పరువు నష్టం కేసులో ముంబై కోర్టుకు రాహుల్‌

పరువు నష్టం కేసులో ముంబై కోర్టుకు రాహుల్‌

పరువు నష్టం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్‌ గాంధీ ఇవాళ(గురువారం) ముంబై కోర్టుకు హాజరయ్యారు. ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్య ఘటన క్రమంలో బీజేపీ ,RSSపై రాహుల్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను ఓ RSS కార్యకర్త రాహుల్‌పై పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌పై ముంబై కోర్టు ఇవాళ విచారణ చేపట్టగా, ఆయన కోర్టుకు హాజరయ్యారు.

ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేశ్‌ 2017 సెప్టెంబరులో బెంగళూరులోని తన ఇంటి ముందే దారుణహత్యకు గురయ్యారు. అప్పట్లో ఈ హత్యపై రాహుల్‌ స్పందిస్తూ బీజేపీ,ఆర్‌ఎస్‌ఎస్‌ సిధ్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిపై ఒత్తిడి పెరుగుతుంది. దాడులు ,హత్యలు జరుగుతాయని అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో RSS కార్యకర్త రాహుల్‌ గాంధీపై ఫిర్యాదు చేశారు. కోర్టులో పరువునష్టం దావా వేశారు. గతంలో దీనిపై విచారణ జరిపిన ముంబై కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో రాహుల్‌కు సమన్లు జారీ చేసింది.