గవర్నర్ సత్యపాల్ మాలిక్కు రాహుల్ కౌంటర్
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో టెన్షన్పై ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సెక్యూరిటీ బలగాల కట్టడిలోఉన్న కాశ్మీర్లో హింస జరుగుతోందంటూ రాహుల్ చేసిన కామెంట్లను గవర్నర్ ఖండించారు. ‘‘రాహుల్ గాంధీ లాంటి బాధ్యత గల వ్యక్తులు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏం జరుగుతోందో కాశ్మీర్కే వచ్చి చూడాలి. ఆయన కోసం ఓ స్పెషల్ ఫ్లైట్ పంపుతా’’అని సోమవారం ఒక ప్రకటన చేశారు. దీనిపై రాహుల్ గాంధీ మంగళవారం ట్విటర్లో స్పందించారు. ‘‘డియర్ గవర్నర్ మాలిక్, మీ ఆహ్వానం మేరకు ప్రతిపక్ష నేతలతో కలిసి నేను కూడా జమ్మూ కాశ్మీర్, లడక్లో పర్యటిస్తా. మాకు స్పెషల్ ఫ్లైట్ వద్దుకానీ అక్కడి ప్రజల్ని, నాయకుల్ని, జవాన్లని కలుసుకునే ఫ్రీడం మాత్రం ఇస్తే చాలు”అని కౌంటరిచ్చారు. రాహుల్ ట్విటర్లో కామెంట్ చేసిన కొద్దిసేపటికే గవర్నర్ మాలిక్ మరోసారి విరుచుకుపడ్డారు. ‘‘రాహుల్ ఆటలాడుతున్నారు. జమ్మూకాశ్మీర్ అంటే ఆయనకు లెక్కలేదు. కాబట్టే అసలు సబ్జెక్ట్ తెలియని బెంగాలీ లీడర్(అధిర్ చౌధురి)తో పార్లమెంట్లో మాట్లాడించారు. పీఎం మోడీ ప్రకటనతో 90 శాతం కాశ్మీరీల్లో భయాందోళనలు తొలగిపోయాయి. కాశ్మీర్, లడక్లో పెట్టుబడులకు అనిల్ అంబానీ కూడా రెడీ అయ్యారు’’అని చెప్పుకొచ్చారు. కాశ్మీర్లోకి ఇతర నాయకుల్ని అనుమతించే అంశాన్ని రాహుల్ రాజకీయం చేస్తున్నారని, పొలిటికల్ పర్యటనలతో ప్రశాంతతను చెడగొట్టాలనుకుంటున్నారని మాలిక్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలకు పర్మిషన్ ఇవ్వాలా వద్దా అన్నది పోలీసులే నిర్ణయిస్తారని పేర్కొన్నారు.
17న షా రాక.. ఆ తర్వాతే ప్రతిపక్షాలకు అనుమతి!
గవర్నర్, రాహుల్ మధ్య మాటల యుద్ధం తర్వాత కాశ్మీర్ వ్యాలీలోకి ప్రతిపక్ష నేతలకు అనుమతిచ్చే అంశంపై కేంద్ర సర్కార్ దృష్టిసారించింది. దీనికి సంబంధించి లోకల్ ఆఫీసర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్లు తెలిసింది. పోలీసుల ఆధీనంలో ఉన్న ఒమర్ అబ్దుల్లా, మొహబూబా ముఫ్తీలను కూడా కలిసేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలా, వద్దా అనేదానిపై చర్చ జరుగుతున్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆగస్టు 17 నుంచి లేహ్ టౌన్లో నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ జరుగనుందని, ఆ వేడుకలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారని, ఆయన పర్యటన పూర్తైన వెంటనే ప్రతిపక్ష నేతలను కాశ్మీర్లోకి అనుమతించే అవకాశాలున్నాయని తెలిసింది.
2 నిమిషాలు మాట్లాడేందుకు.. 2 గంటలు వెయిటింగ్
శ్రీనగర్: రెండు నిమిషాలు ఫోన్లో మాట్లాడేందుకు కాశ్మీరీ ప్రజలు రెండు గంటల పాటు లైన్లో నిలుచుంటున్నారు. లోయ బయటున్న తమ బంధువులతో మాట్లాడేందుకు ఈ వెయిటింగ్తప్పట్లేదని చెబుతున్నారు. కాశ్మీర్స్పెషల్స్టేటస్ రద్దు చేశాక ముందుజాగ్రత్త చర్యగా లోయలో మొబైల్, ఇంటర్నెట్సేవలను ప్రభుత్వం నిలిపేసింది. దీంతో బయటి ప్రపంచంతో సంబంధంలేకుండా పోయింది. అత్యవసరంగా కబురు పంపించాలన్నా వేచి ఉండక తప్పడంలేదు. ఆగస్టు 5 నుంచి ఫోన్సర్వీసులపై ఆంక్షలు విధించగా.. సోమవారం నుంచి కొద్దిగా వెసులుబాటు కల్పించారు. డిప్యూటీ కమిషనర్ఆఫీస్ఆవరణలో పబ్లిక్టెలిఫోన్బూత్లు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ జనాలు క్యూ కట్టారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో ఒక్కొక్కరికీ రెండు నిమిషాలు మాట్లాడేందుకు అధికారులు అనుమతిచ్చారు. వెయిటింగ్ముగిసి తమ వంతు వచ్చాక ఒకటీ అరా మాట్లాడేసరికి టైం అయిపోతోందని జనాలు చెబుతున్నారు.
