మోడీ ఇండియాను మోసం చేసినట్టే : రాహుల్ గాంధీ

మోడీ ఇండియాను మోసం చేసినట్టే : రాహుల్ గాంధీ

కశ్మీర్ పై మధ్యవర్తిత్వం చేయమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనను అడిగారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇండియాలో పెనుదుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోడీ వివరణకు డిమాండ్ చేశారు. ఒకవేళ ట్రంప్ చేసిన కామెంట్లే నిజమైనట్టయితే… ఇండియాను నరేంద్రమోడీ వెన్నుపోటు పొడిచినట్టే అని తీవ్రంగా విమర్శించారు. 1972 షిమ్లా ఒప్పందాన్ని కూడా ప్రధాని మోడీ తుంగలో తొక్కినట్టే అని అన్నారు.

ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ బలహీనమైన బదులిచ్చిందని అన్నారు రాహుల్ గాంధీ. ఈ మాత్రం వివరణ సరిపోదన్నారు. ప్రధానమంత్రి మోడీ దీనిపై దేశానికి వివరణ ఇవ్వాలన్నారు. ట్రంప్, మోడీ మీటింగ్ మధ్యలో ఏం చర్చించుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ.