
18వ లోక్ సభ సమావేశాలు రెండో రోజు రాయ్ బరేలీ ఎంపీగా రాహుల్ గాంధీ ప్రమాణం చేశా రు. రాహుల్ స్పీకర్ వేదిక వద్దకు వెళ్తుండగా కాంగ్రెస్ ఎంపీలంతా లేచి నినాదాలు చేశారు. ప్రమాణ స్వీకారం టేబుల్ వద్దకు చేరుకున్న తర్వాత రాహుల్ చిరునవ్వు నవ్వుతూ.. రాజ్యాంగ ప్రతిని సభ్యులకు చూపించారు. అనంతరం ప్యానెల్ సభ్యుడు పగ్గన్ సింగ్ కులస్తే రాహుల్తో ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా రాజ్యాంగ ప్రతిని రాహుల్ తన కుడిచేతిలో పట్టుకొని ప్రమాణం చేశారు. చివర్లో జై హింద్, జై సంవిధాన్ (రాజ్యాంగం) అంటూ ఆయన తన ప్రమాణాన్ని ముగించారు. ఆయన ప్రమాణం చేస్తున్నంత సేపు.. ప్రతిపక్ష నేతలు ‘జోడో జోడో భారత్ జోడో’ అంటూ నినాదాలు చేశారు.