అమెరికాలో పర్యటించనున్న రాహుల్ గాంధీ

అమెరికాలో పర్యటించనున్న రాహుల్ గాంధీ

లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో అమెరికాలో పర్యటించనున్నారు. అక్కడ భారతీయ ప్రవాసులు, విద్యార్థులు, చట్టసభ సభ్యులతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ సామ్ పిట్రోడా ధ్రువీకరించారు. రాహుల లోక్‌సభలో ప్రతిపక్ష నేత (ఎల్‌ఓపి) అయిన తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.

రాహుల్ గాంధీ రాబోయే పర్యటన గురించి సామ్ పిట్రోడా పలు వివరాలను పంచుకున్నారు. సెప్టెంబర్ 8న టెక్సాస్‌లోని డల్లాస్‌లో.. 9, 10 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో రాహుల్ పర్యటించనున్నట్లు పిట్రోడా తెలిపారు. ప్రవాస భారతీయులు, ఎన్‌ఆర్‌ఐ సోదరసోదరీమణులు, వ్యాపారవేత్తలు, టెక్నోక్రాట్లు, విద్యావేత్తలు, పాత్రికేయులు, థింక్ ట్యాంక్‌ల ప్రతినిధులతో కాంగ్రెస్ ఎంపీ సమావేశం కానున్నారని పిట్రోడా వెల్లడించారు.

రాహుల్ గాంధీ చివరిసరి మే 30, 2023న అమెరికాలో పర్యటించారు.