టీమిండియా ఓటమికి మోదీనే కారణం : రాహుల్ గాంధీ

టీమిండియా ఓటమికి మోదీనే కారణం :  రాహుల్ గాంధీ

జైపూర్:  అహ్మదాబాద్ లో ఆస్ట్రేలియాతో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో  మన దేశం ఓడిపోవడానికి ప్రధాని మోదీనే కారణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ రాక అప శకునమని.. ఫైనల్ మ్యాచ్ కు ఆయన రావడం వల్లే ఇండియా ఓడిందన్నారు. రాజస్థాన్ లోని జలోర్ లో మంగళవారం ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడారు.

మోదీ ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తినని చెప్పుకుంటారని.. కానీ వారి కోసం ఏమీ చేయడం లేదని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మండిపడ్డారు. రాహుల్ భాష సరిగ్గా లేదన్నారు. ఆయనకు ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఖండించారు.