మోడీది గాడ్సే ఐడియాలజీ

మోడీది గాడ్సే ఐడియాలజీ

ప్రధానిపై రాహుల్ తీవ్ర విమర్శలు

వయనాడ్ (కేరళ): కేరళ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే సిద్ధాంతం, ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధాంతం ఒక్కటేనంటూ ఘాటుగా విమర్శించారు. సీఏఏకు వ్యతిరేకంగా “సేవ్ కానిస్టిట్యూ షన్ ”పేరుతో కేరళలోని ‘కాల్ పెట్టా’ లో గురువారం జరిగిన ప్రదర్శనకు రాహుల్ గాంధీ నాయకత్వం వహించారు. అంతకుముందు వేలాదిమంది పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సీఏఏ పై మాట్లాడుతూ.. ఎవరు ఇండియన్లో నిర్ణయించడానికి మోడీ ఎవరని ప్రశ్నించారు. “నాకు తెలుసు నేను ఇండియన్ అని.. దాన్ని ఎవరి దగ్గరా నిరూపించుకోవాల్సిన అవసరంలేదు”అని ఆయన అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడం, ఆర్థిక పరిస్థితి దిగజారడంపైనా రాహుల్ ఆవేదన వ్యక్తంచేశారు.