వరంగల్ పబ్లిక్.. కొంపదీసి వాసు పికెల్స్, నీలకంఠ పికిల్స్లో పచ్చళ్లు కొన్నారా..?

వరంగల్ పబ్లిక్.. కొంపదీసి వాసు పికెల్స్, నీలకంఠ పికిల్స్లో పచ్చళ్లు కొన్నారా..?
  • కెమికల్స్ కలిపి పికెల్స్ తయారీ
  • రూ.18.29 లక్షల విలువైన పచ్చళ్లు సీజ్

హనుమకొండ, వెలుగు: ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్​ ఇండియా(ఎఫ్​ఎస్ఎస్ఏఐ) అనుమతులు లేకుండా తయారు చేయడంతో పాటు పాడైపోయినప్పటికీ, మార్కెట్లో అమ్మేందుకు సిద్ధంగా ఉంచిన పచ్చళ్లను వరంగల్ టాస్క్ ఫోర్స్  పోలీసులు పట్టుకున్నారు. వరంగల్  కాశీబుగ్గ ప్రాంతంలో వాసు పికెల్స్, నీలకంఠ పికిల్స్ పేరుతో కొంతకాలంగా పచ్చళ్ల బిజినెస్  చేస్తున్నారు.

ఫుడ్  సేఫ్టీ స్టాండర్డ్స్  పాటించకపోవడంతో పాటు టేస్ట్​ కోసం నిషేధిత కెమికల్స్​కలుపుతూ పచ్చళ్లను తయారు చేస్తున్నారు. సమాచారం అందుకున్న వరంగల్ టాస్క్ ఫోర్స్  పోలీసులు శనివారం సాయంత్రం దాడులు నిర్వహించి రూ.18.29 లక్షల విలువైన పచ్చళ్లను సీజ్  చేశారు. షాప్  ఓనర్లు అరుకల శ్రీనివాస్, మార్త  శంకర్ ను అదుపులోకి తీసుకుని, స్వాధీనం చేసుకున్న పచ్చళ్లను టెస్టుల కోసం ఇంతేజార్  గంజ్  పోలీసులకు అప్పగించారు.