
- సామాన్యుడు తిరగబడితే
రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా జంటగా ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన చిత్రం ‘తిరగబడర సామీ’. ఆగస్టు 2న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఒక సాదాసీదా కుర్రాడిని తన జీవితంలో వచ్చే పరిస్థితులు ఎలా మార్చాయనేది మెయిన్ కాన్సెప్ట్. కథలో భాగంగా కొంత యాక్షన్ సీన్స్ ఉంటాయి. రాజ్ తరుణ్ ఈ పాత్రకు యాప్ట్ అని భావించాం. తను అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. మూడు ముళ్ళ బంధానికి భార్యాభర్తలు ఏ విధంగా కట్టుబడి ఉండాలనడానికి నిదర్శనం ఈ సినిమా.
కంటెంట్ చాలా బావుంటుంది. అందరికీ నచ్చుతుంది. మన్నారా చోప్రా ఇందులో నెగిటివ్ ఫీమేల్ లీడ్ చేసింది. రవికుమార్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. చెప్పినదాని కంటే అద్భుతంగా తీశారు. బిజినెస్ పరంగానూ ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఇక జేడీ చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్తో ఓ సినిమా జరుగుతోంది. అలాగే బాలీవుడ్లో నా స్నేహితుడు రాజ్ డైరెక్షన్లో ఓ సినిమా, ‘రాహు కేతు’ అనే వెబ్ సిరీస్, తిరుపతి బాలాజీపై ఓ వెబ్ సిరీస్ తీస్తున్నాం’ అని చెప్పారు.