రూ. 10 లక్షల రజక బంధు ఇవ్వాలి : ఎంపీ ఆర్. కృష్ణయ్య

రూ. 10 లక్షల రజక బంధు ఇవ్వాలి : ఎంపీ ఆర్. కృష్ణయ్య

బషీర్ బాగ్,- వెలుగు : బీసీ కులాల్లో రజకులు అత్యంత వెనకబడి ఉన్నారని, పాలకులు వారి సంక్షేమాన్ని విస్మరించారని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు.   హైదరాబాద్ కాచిగూడలో ఆదివారం  జరిగిన తెలంగాణ రాష్ట్ర రజక సంఘం సర్వసభ్య సమావేశంలో ఆర్. కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  రజక ఫెడరేషన్ రాష్ట్రంలో నామమాత్రంగానే ఉందన్నారు.  

వెయ్యి కోట్లు కేటాయించి , ప్రతి రజక కుటుంబానికి  రూ.10 లక్షలు రజక బంధు అందించాలని కోరారు.  రజక కులస్తులకు 5 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.  ఈ సమావేశంలో రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య , బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, సంఘ నాయకులు జనార్దన్, నిరంజన్, యాదగిరి, ఉదయ్, భూతరాజు బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.