రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కాపూర్ లోని నిన్న వ్యవసాయ బావిలో పడిన చిరుత బయటకు వెళ్లిపోయింది. రెస్కూ ఆపరేషన్ లో భాగంగా చిరుతను పట్టుకునేందుకు బాక్స్ ను బావిలోకి దించారు అధికారులు. అలాగే రాత్రి బావిలోకి నిచ్చెన వేసి ఉంచారు. దీంతో రాత్రి నిచ్చెన ద్వారా చిరుత బయటకు వెళ్లిపోయిందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అయితే చిరుత ఎక్కడికి వెళ్లేందో అధికారులు క్లారిటీ ఇవ్వకపోవటంతో పొలాల దగ్గరకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు.
see more news