ఏపీ రాజధాని కథాంశంగా భాను దర్శకత్వంలో కంఠంనేని రవిశంకర్ నిర్మించిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. అఖిలన్, వీణ, అంకిత ఠాకూర్, అమృత చౌదరి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
సోమవారం ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఏపీ రాజధాని కోసం భూముల్ని త్యాగం చేసిన వేలాదిమంది రైతుల ఆవేదనను సినిమా ద్వారా చూపించబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.