సీఈసీగా బాధ్యతలు తీసుకున్న రాజీవ్​ కుమార్

సీఈసీగా బాధ్యతలు తీసుకున్న రాజీవ్​ కుమార్

భారతదేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా రాజీవ్​ కుమార్​ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలో ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో సీఈసీగా బాధ్యతలు స్వీకరించారు. 2025 ఫిబ్రవరి వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. ఇప్పటి వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఉన్న సుశీల్​ చంద్ర శనివారం పదవీ విరమణ చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ అధికారిని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ గా నియమించడం ఆనవాయితీ. దీనిని అనుసరించి రాజీవ్ కుమార్‌ను ఇటీవల రాష్ట్రపతి సీఈసీగా నియమించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 ఫిబ్రవరి వరకు రాజీవ్​ సీఈసీగా ఉంటారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతోపాటు 2024లో సార్వత్రిక ఎన్నికలు కూడా ఆయన సారథ్యంలోనే జరగనున్నాయి. 

1960 ఫిబ్రవరి 19న జన్మించిన రాజీవ్ కుమార్ బీఎస్సీ, ఎల్​ఎల్​బీ, పీజీడీఎం, ఎంఏ (పబ్లిక్ పాలసీ) చేశారు. బిహార్, ఝార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి(1984 బ్యాచ్) అయిన రాజీవ్ కుమార్ 2020 ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశారు. 2020 సెప్టెంబర్​ 1న ఎన్నికల కమిషనర్ గా రావడానికి ముందు 'ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక మండలి' ఛైర్ పర్సన్ గానూ సేవలందించారు.

మరిన్ని వార్తల కోసం..

సార్ పాస్ చేయండి.. లేకపోతే పెళ్లి చేస్తారు.. విద్యార్థుల వింత కోరికలు

క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వరకూ కాంగ్రెస్ పాద‌యాత్ర