నారాయణపేట జిల్లాల్లో బీసీల అప్లికేషన్లే ఎక్కువ .. రాజీవ్​ యువ వికాసం ఫైనల్​ లిస్ట్​ సిద్ధం

నారాయణపేట జిల్లాల్లో బీసీల అప్లికేషన్లే ఎక్కువ .. రాజీవ్​ యువ వికాసం ఫైనల్​ లిస్ట్​ సిద్ధం
  • పాలమూరు, నారాయణపేట జిల్లాల్లో 66,725 దరఖాస్తులు
  • నేటి నుంచి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్​ అందజేత

మహబూబ్​నగర్, వెలుగు: రాజీవ్​ యువ వికాసం స్కీం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు పెద్ద మొత్తంలో సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. స్కీం కోసం ఇప్పటికే చాలా మంది అప్లికేషన్లు పెట్టుకోగా.. వీరికి సోమవారం నుంచి ప్రొసీడింగ్స్ అందించనుంది. అయితే ఆరు కార్పొరేషన్ల నుంచి రుణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధం అవగా.. పాలమూరు, నారాయణపేట జిల్లాల నుంచి 66,725 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో ఎక్కువగా బీసీ కార్పొరేషన్​ రుణాల కోసం 37,869 దరఖాస్తులు వచ్చాయి. 

నారాయణపేటలో 24,438 రిజిస్ట్రేషన్లు..

నారాయణపేట జిల్లాలో ఆరు కార్పొరేషన్ల పరిధిలో స్కీం కోసం 24,438 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో ఎస్సీ కార్పొరేషన్​ కింద రూ.50 వేల లోపు 476 యూనిట్లు టార్గెట్​ కాగా 183 అప్లికేషన్లు, రూ.50 వేల నుంచి లక్ష యూనిట్  వరకు 679 టార్గెట్​ కాగా 61 అప్లికేషన్లు, రూ.లక్ష ఆపై నుంచి రూ.2 లక్షల యూనిట్లకు 526 టార్గెట్​ ఉండగా 995, రూ.2 లక్షలు ఆపై నుంచి రూ.4 లక్షల యూనిట్​ వరకు 775 టార్గెట్​ ఉండగా 3,932 అప్లికేషన్లు వచ్చాయి. ఎస్టీ కార్పొరేషన్​ కింద రూ.50 వేల లోపు 366 టార్గెట్​  ఉండగా3 అప్లికేషన్లు, రూ.50 వేల నుంచి రూ.లక్ష లోపు 204 టార్గెట్​ ఉండగా 13, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల లోపు 172 టార్గెట్​కు 171, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలకు 98 టార్గెట్​కు గాను 1,269, బీసీ కార్పొరేషన్​ కింద రూ.50 వేల లోపు యూనిట్​కు 1393 టార్గెట్​ ఉండగా 264, రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు 731 టార్గెట్​ ఉండగా 381, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 726 టార్గెట్​కు గాను 1,710, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 484 టార్గెట్​కు 12,112 అప్లికేషన్లు వచ్చాయి. 

ఈబీసీ కార్పొరేషన్​ కింద రూ.50 వేల లోపు యూనిట్​కు 259 టార్గెట్​ ఉండగా 15 అప్లికేషన్లు, రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు 136 టార్గెట్​కు 15, రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు 135 టార్గెట్​కు 58, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 93 టార్గెట్​కు 457, మైనార్టీ కార్పొరేషన్​ కింద రూ.50 వేల లోపు యూనిట్​కు 79 టార్గెట్​కు 141, రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు 138 టార్గెట్​కు గాను 783, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 79 టార్గెట్​కు 1,008, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలకు 180 టార్గెట్​కు 753, క్రిష్టియన్​ కార్పొరేషన్​ కింద రూ.50 వేల లోపు యూనిట్​కు ఒక టార్గెట్​కు ఆరు అప్లికేషన్లు, రూ.50 వేల నుంచి రూ.లక్షకు టార్గెట్​ 3 ఉండగా 6 అప్లికేషన్లు, రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు టార్గెట్​ ఒకటి ఉండగా 12 అప్లికేషన్లు, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు మూడు టార్గెట్​ ఉండగా 63 అప్లికేషన్లు వచ్చాయి. 

ఇదీ స్కీం..

రాజీవ్​ యువ వికాసం స్కీం కింద రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, క్రిష్టియన్​ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది.  నాన్​ అగ్రికల్చర్​ స్కీములకు ఏజ్​ లిమిట్​ 21 నుంచి -55 ఏండ్ల వరకు.. అగ్రికల్చర్, దాని అనుబంధ రంగాల స్కీముల కోసం అప్లికేషన్​లు పెట్టుకునే వారి  ఏజ్​ లిమిట్​ 21 నుంచి 60 ఏండ్ల ఉండాలని రూల్​ పెట్టింది. రూ.50 వేల యూనిట్​కు వంద శాతం సబ్సిడీ, రూ.50 వేలు ఆపై రూ.లక్ష వరకు యూనిట్​కు 90 శాతం సబ్సిడీ ఇవ్వనుండగా.. బ్యాంక్​ లోన్​ 10 శాతం, రూ.లక్ష ఆపై నుంచి రూ.2 లక్షల వరకు యూనిట్​కు 80 శాతం సబ్సిడీ ఉండగా.. బ్యాంక్​ లోన్​ 20 శాతం, రూ.2 లక్షలు ఆపై నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం సబ్సిడీ ఉండగా.. బ్యాంక్​ లోన్​ 30 శాతం ఇవ్వనుంది. స్కీములో భాగంగా మొదట రూ.50 వేలు, రూ.50 వేల నుంచి రూ.లక్ష లోపు రుణాలకు మాత్రమే ప్రొసీడింగ్స్​ ఇవ్వనున్నారు. 

ఇప్పటికే అర్హులకు సంబంధించిన ఫైనల్​ లిస్ట్​ ఆయా జిల్లాల ఇన్​చార్జి మంత్రులకు చేరగా.. వారు ఫైనల్​ చేసినట్లు తెలిసింది. ఫైనల్​ లిస్ట్​ ఆధారంగా సోమవారం నుంచి ఈ నెల 9 వరకు అర్హులకు ప్రొసీడింగ్స్​ 
అందించనున్నారు. 

మహబూబ్​నగర్​లో 42,287 అప్లికేషన్లు..

మహబూబ్​నగర్​ జిల్లాలో ఈ స్కీం కోసం 42,287 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో ఎస్సీ కార్పొరేషన్​ కింద 3,366 టార్గెట్​కు గాను 7,540 మంది ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీ కార్పొరేషన్​ కింద 2,972 టార్గెట్​ ఉండగా.. 5,168, బీసీ కార్పొరేషన్​ కింద 5,504 టార్గెట్​కు 23,402, మైనార్టీ కార్పొరేషన్​ కింద 1,087 టార్గెట్​ ఉండగా 5,946, క్రిష్టియన్​ మైనార్టీ కార్పొరేషన్​ కింద 95 టార్గెట్​ ఉండగా 231 అప్లికేషన్లు వచ్చాయి.