రాజ్యసభలో రూ. 250 నాణెం పంపిణీ

రాజ్యసభలో రూ. 250 నాణెం పంపిణీ

రాజ్యసభ 250 సమావేశాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ 250 రూపాయల నాణాన్ని రాజ్యసభ సభ్యులకు పంపిణీ చేసింది. ఆ నాణాన్ని గురువారం రాజ్యసభలో సభ్యులకు అందజేశారు. ఈ నాణాన్ని రాజ్యసభ సభ్యులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ నాణెం 10 గ్రాముల వెండితో తయారుచేయబడింది. ఈ నాణెంపై 250 డాట్స్, లైన్స్ ఉన్నాయి. అంతేకాకుండా నాణెంపై మహాత్మాగాంధీ బొమ్మ కూడా ముద్రించారు. ఈ నాణెం కేవలం రాజ్యసభ 250 సమావేశాలకు గుర్తుగా ముద్రించిందే తప్ప ప్రజల సౌకర్యార్థం కాదని రిజర్వ్ బ్యాంక్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

For More News..

కరోనా ఎఫెక్ట్: చికెన్‌, మటన్‌లకు ప్రత్యామ్నాయం దొరికింది

సినీ దంపతులకు కరోనా వైరస్

ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడూ అనుకోలేదు