పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం

పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం

జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుపై స్లిప్పులతో  ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు మద్దతుగా 125, వ్యతిరేకంగా 61 మంది సభ్యులు ఓటేశారు. బిల్లుపై  మొదట ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. సాంకేతిక లోపం తలెత్తడంతో.. తిరిగి స్లిప్పులతో ఓటింగ్ చేపట్టారు.ఓటింగ్ అనంతరం రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడింది.