‘గేమ్ ఛేంజర్’ స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

 ‘గేమ్ ఛేంజర్’ స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల
  • కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ జాబిలమ్మ

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శంకర్ తెరకెక్కిస్తున్న  ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. బుధవారం కియారా పుట్టినరోజు సందర్బంగా విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.  ఇందులో మల్టీ కలర్ లెహంగాలో ఎంతో అందంగా కనిపిస్తోంది కియారా.

ఇప్పటికే విడుదలైన ‘జరగండి జరగండి’ అనే పాటలోని లుక్ ఇది.  ‘మా జాబిలమ్మ అలియాస్ కియారా అద్వానీకి బర్త్ డే విషెస్.. త్వరలోనే ఆమె మీ అంద‌‌‌‌‌‌‌‌రి హృద‌‌‌‌‌‌‌‌యాల‌‌‌‌‌‌‌‌ను మంత్రముగ్ధుల‌‌‌‌‌‌‌‌ను చేయబోతోంది’ అంటూ ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  అంజ‌‌‌‌‌‌‌‌లి, ఎస్‌‌‌‌‌‌‌‌.జె.సూర్య, శ్రీకాంత్, జయరాం, సునీల్, సముద్రఖని ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  తమన్ సంగీతం అందిస్తున్నాడు.  క్రిస్మస్ సందర్బంగా డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిలీజ్ చేయబోతున్నట్టు దిల్ రాజు ఇటీవల ప్రకటించారు.