5 లక్షల కుక్కల మధ్య మేయర్‭ను పెట్టాలి: ఆర్జీవి

5 లక్షల కుక్కల మధ్య మేయర్‭ను పెట్టాలి: ఆర్జీవి

అంబర్ పేట్ ఘటనపై మేయర్ విజయలక్ష్మీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. వీధి కుక్కలను నగరవాసులు దత్తత తీసుకోవాలన్న విజయలక్ష్మీ వ్యాఖ్యలను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పుబట్టారు. ట్విట్టర్ వేదికగా మేయర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ విజయలక్ష్మీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జంటనగరాల్లో కుక్కలను ఇంటికి తీసుకెళ్లి ఆహారం ఇవ్వాలంటూ ఆమె పై సెటైర్లు వేశారు. అంతేకాకుండా నగరంలోని మొత్తం 5 లక్షల కుక్కలను ఒక డాగ్ హోంగా మార్చాలని అందులో వాటి మధ్య మేయర్‭ను ఉంచాలని మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేశారు.

అంతేకాకుండా మేయర్ తాను పెంచుకుంటున్న కుక్కకు ఆహారం తినిపిస్తున్న 2021 మార్చి 3వ తేదీన పోస్ట్ చేసిన అప్పటి వీడియోను ట్యాగ్ చేశారు. అప్పటి కుక్కలు ఇప్పుడు మనుషులపై దాడులు చేస్తున్నాయని దీనిపై విచారణ జరపాలంటూ వర్మ ట్వీట్ చేశారు.