టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) మరోసారి టీడీపీ నేత నారా లోకేష్(Nara Lokesh) ను టార్గెట్ చేశాడు. తాజాగా లోకేష్ పై ఆర్జీవీ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ వర్మ.. "ఆస్కార్(Oscar) అవార్డు రావాల్సింది ఆర్ఆర్ఆర్(RRR) సినిమా, రాజమౌళి(Rajamouli), కీరవాణి(Keeravani), రామ్ చరణ్(Ram charan), జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)కు కాదు.. మన టీడీపీ నేత నారా లోకేశ్కు దక్కాలి అంటూ సెటైరికల్గా ట్వీట్ చేశారు.
ఇటీవల టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీలోని రాయలసీమలో యువగళం పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక రాయలసీమలో పాదయాత్ర ముగియడంతో ఈ సందర్బంగా నేలకు నమస్కరించాడు. ఈ ఫోటోను లోకేశ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోపై స్పందించిన ఆర్జీవీ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు.
మరి రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ కామెంట్స్ కు టీడీపీ వర్గాల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
https://twitter.com/RGVzoomin/status/1669023280685289474