మొదలైన ఆర్జీవీ "వ్యూహం".. జగన్, భారతి పాత్రలు రివీల్

మొదలైన ఆర్జీవీ "వ్యూహం".. జగన్, భారతి పాత్రలు రివీల్

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram gopal varma) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాలపై ఒక సినిమా తియ్యబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అది కూడా రెండు భాగాలుగా ఈ సినిమా రానుంది. అందులో మొదటి భాగానికి ‘వ్యూహం’, రెండో భాగానికి ‘శపథం’ అనే టైటిల్స్ కూడా ఫిక్స్ చేశాడు వర్మ. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ షూటింగ్ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. 

ఈ సినిమాలో ఏపీ సీఎం జగన్ (YS Jagan Mohan Reddy), వైఎస్ భారతి (Y S Bharati) క్యారెక్టర్ లో ఎవరు నటిస్తున్నది స్పష్టం చేసాడు వర్మ. అంతకుముందు వర్మ తెరకెక్కించిన లక్ష్మిస్ ఎన్టీఆర్ లో మూవీలో జగన్ పాత్ర చేసిన అజ్మల్ అమీర్ (Ajmal Ameer) ఈ మూవీలో కూడా జగన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక వైఎస్ భారతి పాత్రలో మానస రాధా కృషన్(manasa radhakrishnan) నటించబోతుంది. ఈ లుక్స్ చుసిన ఆడియన్స్.. పాత్రలకు వీళ్ళు  కరెక్ట్ గా సెట్ అయ్యారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

మరి వ్యూహం షూటింగ్ మొదలు పెట్టేసిన వర్మ..  ఈ చిత్రాన్ని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడో చూడాలి. ఇక గత ఎన్నికల ముందు RGV చంద్రబాబు(Chandrababu naidu)ను టార్గెట్ చేస్తూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఇప్పుడు ఈ సినిమాతో మరో సంచలనానికి తెరలేపాడు వర్మ.